కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 29 : రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని ఆశాకార్యకర్తలు డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లాలోని ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి ప్రతి వారం ఏఎంసీ టార్గెట్లు విధించడం విరమించుకోవాలని, ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలని కోరారు.
ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్కి వినతిపత్రం అందజేశారు. ఇక్కడ సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, జిల్లా సహాయ కార్యదర్శి పున్నం రవి, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రంగవేణి శారద, ప్రధాన కార్యదర్శి మారెల్ల శ్రీలత, 200 మంది ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.