చొప్పదండి, నవంబర్ 25: తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. దేశ ప్రజల సంక్షేమం కోరే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీనీ బీఆర్ఎస్గా నామకరణం చేశారని స్పష్టం చేశారు. చొప్పదండిలోని జీఆర్ఆర్ఆర్ గార్డెన్స్లో చొప్పదండి జువ్వాడి చుక్కారావు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవానికి శుక్రవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ఆయన పాల్గొనగా ఏడీఏ పద్మావతి ప్రమాణం చేయించారు. అనంతరం వినోద్ మా ట్లాడుతూ తెలంగాణలో 24 గంటల కరెంట్ , రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ అధికారంలో వచ్చాక వెంటనే నల్లధనాన్ని బయటకు తెచ్చి, ప్రతీ రైతు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని ప్రగల్భాలు పలికారని, ఎనిమిదేళ్లయినా ఇప్పటి వర కు ఒక్క రూపాయి కూడా ఖాతాలో వేయకుండా వేలకోట్లు ఎగ్గొట్టిన వారికి అండగా నిలుస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ర్టానికి ఒక్క కార్మాగారాన్ని కేటాయించని మోదీ 1970లో నిర్మించిన రామగుండం యూరియా ఎరువుల ఫ్యాక్టరీని ఇప్పుడు దేశానికి అంకితం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేసుకుంటున్నామన్నారు. సంక్షేమపథకాల అమలులో దేశంలో తెలంగాణ మొదటి వరుసలో ఉందని స్వయంగా ప్రధాని మోదీప్రశంచారని గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పడిన 2014 లో రాష్ట్రంలో 68లక్షల టన్నులు వరిధాన్యం పం డితే ప్రస్తుతం 201లక్షల టన్నులు పండిస్తున్నామని, రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో 195శాతం ధాన్యం ఎక్కువగా పండించేలా సౌకర్యాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని కొనియాడారు. రైతుబంధు ద్వారా రూ.60వేల కోట్లు చెల్లించామని తెలిపారు. ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించడం రాష్ర్టానికే గర్వకారణమన్నా రు. రైతుబీమా కింద రాష్ట్రంలో రూ.4500 కోట్లు ఇచ్చిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో బహిరంగ చర్చ పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీ(బీ)ఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. నామినేటె డ్ పదవులు రానివారు నిరాశ చెందకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, వారికి తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ చొప్పదండి ని యోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన ఎంపీ బండి సంజయ్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ స్మార్ట్సిటీ ప్రదాత వినోద్కుమార్ అని కొనియాడారు. మార్కెట్ పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉంటూ సేవకులుగా పనిచేయాలని సూ చించారు. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మా ట్లాడుతూ మార్కెట్ పాలకవర్గం రిజర్వేషన్ల ద్వా రా మహిళలకు సముచితమైన స్థానం లభిస్తున్నదన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి మాట్లాడుతూ చైర్మన్ పదవి రావడం తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవంగా తాను భావిస్తున్నానన్నారు. వైస్ చైర్మన్ రాజశేఖర్ మా ట్లాడుతూ పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉన్న తనను గుర్తించి పదవి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
అంతకుముందు గుమ్లాపూర్ ఎక్స్రోడ్డు నుంచి జీఆర్ఆర్ఆర్ గార్డెన్స్ వరకు వెయ్యి బైక్ల తో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ పొన్నం అనిల్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జడ్పీటీసీ మా చర్ల సౌజన్య-వినయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇ ప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మ న్ సురేందర్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు వీర్ల వెంకటేశ్వర్రావు, ఎంపీపీలు మధుకర్, కవిత, విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, జిల్లా గౌడ సం ఘం అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, గోపాల్రావు పేట మార్కెట్ చైర్మన్ తిరుపతి, బీ(టీ)ఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, జితేందర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.