వేములవాడ టౌన్, ఫిబ్రవరి 3 : గత ఐదు రోజులుగా రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్పై నిర్వహిస్తున్న త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు శనివారం ముగిసాయి. కళాకారులు తమదైన ఆలాపనలతో అహూతులను మంత్రముగ్దులను చేశారు. ధర్మపురికి చెందిన సంగనభట్ల కిషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని రాయభారం శ్రీ లక్ష్మీనర్సింహ నాట్యమండలి పౌరాణిక నాటక ప్రదర్శన ఆధ్యంతం రంజింపజేసింది.
కాగా, ఉత్సవాల్లో నెదర్లాండ్స్ దేశానికి చెందిన సద్గురు జగ్గీ వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ కార్యకర్త శ్రీమతి సుసాన్ సమాధానీ పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు తిరిగి పర్యావరణ పరిరక్షణ చేయడం అనే నినాదంలో భాగంగా శనివారం వేములవాడకు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఆమెను ఆలయ ఈవో కృష్ణప్రసాద్ వేదిక మీదకు ఆహ్వానించారు.