పెద్దపల్లి, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): ఆటవిడుపు, ఆహ్లాదానికి కేరాఫ్గా మారిన మినీ ట్యాంక్బండ్ పర్యాటక శోభను సంతరించుకున్నది. జిల్లా కేంద్రం సాగర్రోడ్డులోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు మినీ ట్యాంక్బండ్పై జలవిహారం అందుబాటులోకి వచ్చింది. జిల్లా కేంద్రం, చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు, చిన్నారులకు ఆటవిడుపుగా మారింది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి శనివారం రాత్రి మినీ ట్యాంక్బండ్ను ప్రారంభించడంతో బోటింగ్ అందుబాటులోకి వచ్చింది.
దీనికి తోడు మినీ ట్యాంక్బండ్పై చిన్నారుల క్రీడా పరికరాలు, చిల్డ్రన్ గార్డెన్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్, మల్టీ స్వింగ్ ఎక్విప్మెంట్, మైల్డ్ స్టీల్ ైక్లెంబింగ్ బార్, జంగిల్ ైక్లెంబింగ్ బార్, స్పైరో స్పిన్, స్ట్రైట్ నెట్ ప్లేగ్రౌండ్ ైక్లెంబర్, గ్రీన్ స్పైరల్ ప్లేగ్రౌండ్ ైస్లెడ్, జ్విమ్స్, స్వింగ్స్, క్రాస్ స్వింగ్స్, స్టేట్ స్వింగ్స్, పైప్ స్వింగ్స్, ఉయ్యాలలు, రాక్ ైక్లెంబింగ్, రౌండ్ బౌట్, రొటేటింగ్ ైక్లెంబర్స్, హోల్డ్ అండ్ స్పిన్నర్స్, ఎక్సర్సైజ్ నిచ్చెనలు, జాయింట్ ైస్లెడ్స్, బ్యాలెన్సింగ్ స్వింగ్స్తో పాటు అనేక రకాల స్పోర్ట్స్ మెటీరియల్ను బిగించి అందుబాటులోకి తెచ్చారు. రాక్ ఫిల్లింగ్, సైడ్ గ్రిల్స్, వాకింగ్ ట్రాక్తో పాటు నిండుకుండలా ఉన్న ఎల్లమ్మ గుండమ్మ చెరువు జలాలు, ఆకుపచ్చని అందాలతో మినీ ట్యాంక్బండ్ పర్యాటకులను పరవశింపజేస్తున్నది.
పెద్దపల్లి జిల్లా కేంద్రం నడిబొడ్డున ఎల్లమ్మ-గుండమ్మ చెరువు 120 ఎకరాల 28 గుంటల్లో విస్తరించి ఉన్నది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రత్యేక చొరవతో ఆ చెరువును మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి నిరంతర పర్యవేక్షణలో మినీ ట్యాంక్బండ్ ప్రజలను ఆకట్టుకునేలా సొబగులు అద్దుకుంటున్నది. మిషన్ కాకతీయ ఫేస్-2లో రూ.6 కోట్ల నిధులతో చెరువు పూడికతీతతో పాటు ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేశారు. చెరువు కట్టను విస్తరించి బయటి వైపు రిటైనింగ్ వాల్, లోపలి వైపు బండ్ రివిట్మెంట్ చేశారు.
చూట్రెన్స్, డౌన్ స్ట్రీమ్, గ్రాస్, కట్టకు ఇరువైపులా రేయిలింగ్ పనులు కూడా చేశారు. దీంతో చెరువు విశాలంగా మారింది. చెరువులో బోటింగ్కు అనుకూలంగా మారింది. అంతేకాకుండా 120 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎల్లమ్మ-గుండమ్మ చెరువును చుట్టి వచ్చేలా పెద్దపల్లి మున్సిపల్, రాష్ట్ర టూరిజం శాఖ సమన్వయంతో బోటింగ్ను ప్రారంభించారు. 20మంది పర్యాటకులు కూర్చొని ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఒక ప్యాసింజర్ స్పీడ్ బోట్, నలుగురు కూర్చునే సామర్థ్యం ఉన్న ఒక స్పీడ్ బోట్, నలుగురు కలిసి బోటింగ్ చేసే సామర్థ్యం ఉన్న రెండు పెడల్ బోట్లను ప్రారంభించారు. జలవిహారం ప్రారంభం కావడంతో బోటింగ్ చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు.
పెద్దపల్లి మినీ ట్యాంక్బండ్లో జలవిహారం చేసేందుకు టూరిజం శాఖ ధరలను నిర్ణయించింది. 20 మంది సామర్థ్యం కలిగిన ప్యాసింజర్ స్పీడ్ బోట్లో ప్రయాణం చేసే పెద్దలకు ఒక్కొక్కరికి రూ.50, పిల్లలకు రూ. 30, స్పీడ్బోట్లో ప్రయాణం చేసే నలుగురికి రూ. 350, పెడల్ బోట్లో ప్రయాణం చేసే నలుగురికి రూ.200గా నిర్ణయించారు.
ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించడమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నది. హైదరాబాద్ నగర ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉండే ట్యాంక్ బండ్ ప్రతీ నియోకవర్గ కేంద్రంలో ఉండాలని సీఎం కేసీఆర్ తలపించారు. అందులో భాగంగానే పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లమ్మ-గుండమ్మ చెరువు మినీ ట్యాంక్బండ్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడికి ఉదయం వస్తే సాయంత్రం వరకూ ఆహ్లాదాన్ని పొందేలా అన్ని ఏర్పాట్లు చేశాం. శనివారం బోటింగ్ను కూడా అందుబాటులోకి తెచ్చాం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
-దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్యే, పెద్దపల్లి
హైదరాబాద్ ఇతర నగరాలకే పరిమితమైన బోటింగ్ మా పెద్దపల్లికి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. శనివారం మినీ ట్యాంక్బండ్ను ప్రారంభించడం, బోట్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. మా కుటుంబం అంతా చాలా ఎంజాయ్ చేసింది. చాలా ఆనందంగా ఉంది.
-పసులోటి వాణి-రవికుమార్, పెద్దపల్లి
నేను పుట్టి పెరిగింది ఇక్కడే. వివాహానంతరం వరంగల్లో ఉంటున్న. భర్తతో కలిసి శనివారం ఇక్కడికి వచ్చాం. ఎల్లమ్మ-గుండమ్మ చెరువు మినీట్యాంక్బండ్ అయ్యిందంటే చూడడానికి వచ్చాం. చాలా అందంగా తీర్చిదిద్దారు. బోటింగ్ కూడా చేశాం. చాలా సంతోషంగా ఉంది.
-కడప మేరీ, వరంగల్
శనివారం నుంచి బోటింగ్ ప్రారంభమైంది. బోట్లు వచ్చి పది రోజులైంది. రోజు చాలా మంది బోటింగ్ చేస్తామని అడిగేవాళ్లు. ఇంకా ప్రారంభం కాలేదని చెప్పే వాడిని. ఆదివారం ఉదయం నుంచి చాలా మంది వచ్చారు. బోటింగ్ చేస్తున్నారు. బోట్లల్లో తిరిగే సమయంలో వాళ్లు చాలా సంతోష పడుతున్నారు. అందరికీ లైఫ్ జాకెట్లు ఇచ్చి బోటింగ్ చేయిస్తున్నాం.
-తాళ్లపల్లి తిరుమలేశ్, బోట్ డ్రైవర్(మినీ ట్యాంక్బండ్)
ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, మున్సిపల్ పాలకవర్గం, పర్యాటక శాఖ సహకారంతో పెద్దపల్లి మినీ ట్యాంక్బండ్లో బోటింగ్ ఏర్పాటు చేశాం. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ పెద్దపల్లి
మాది పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి. ఇక్కడే పుట్టి పెరిగిన. ఇప్పుడు ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటున్న. ఓ పనిమీద కుటుంబంతో ఊరికి వచ్చిన. శనివారం బోటింగ్ స్టార్ట్ అయ్యిందని తెలిసి వచ్చినం. చాలా ఎంజాయ్ చేసినం. పెద్దపల్లిలో బోటింగ్ చేయడం మంచి అనుభూతిని ఇచ్చింది.
-పొలిశెట్టి వెంకటేశ్, నిమ్మ నపల్లి(పెద్దపల్లి మండలం)