కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య సంపదకు నిలయంగా మారుతున్నది. జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయ కేంద్రంగా నీలి విప్లవానికి నాంది పలుకనున్నది. ఇప్పటికే ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు చేతినిండా పనికల్పించిన సర్కారు ఈ దిశగా మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. మిడ్మానేరులో రూ. 2 వేల కోట్లతో మెగా ఆక్వాహబ్ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో అమెరికాకు చెందిన ఫిషిన్ ఇండియా, ఫ్రెష్ టూ హోం, ఆనందా గ్రూప్, సీపీ ఆక్వా సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. అందులో ఫిషిన్ ఇండియా కేజ్ కల్చర్ ట్రయల్ రన్ను పూర్తిచేసింది. ఈ ఆక్వాహబ్తో 10వేల మందికి ఉపాధి లభించనుండగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఉచిత చేపపిల్లల పెంపకం విజయవంతంగా సాగుతున్నది. వందలాది చెరువులు, కుం టలు, వాగుల్లో విరవిగా మీనాలను పెంచారు. శ్రీ రాజరాజేశ్వర, అన్నపూర్ణ, ఎగువ మానేరు ప్రాజెక్టులతో పాటు 440 చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రభుత్వం చేపట్టింది. వీటి ద్వారా 106 మత్స్య పారిశ్రామిక సంఘాల్లో 7636 మంది సభ్యులకు ఉపాధి లభించింది. త్వరలోనే మల్కపేట రిజర్వాయర్లోనూ చేపల పెంపకం చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
భూసేకరణ పూర్తి..
జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచ సమీపంలో ఆక్వాహబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు శ్రీరాజరాజేశ్వర జలాశయంలో 365 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. ఇక్కడే మత్స్య యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లాలో ఆక్వాహబ్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలను ఆహ్వానించారు. ఆయన అమెరికాలో పర్యటించి ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందం కుదిర్చారు.
10 వేల మందికి ఉపాధి..
మత్స్య సంపదను పెంచి మత్స్య కారులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రభు త్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మూ డు రిజర్వాయర్లు, 440 చెరువుల్లో 137.92 లక్షల చేప పిల్లలు, 40.32 లక్షల రొయ్య పిల్లలను మత్స్య శాఖ వదిలిపెట్టింది. ఇందులో మిరిగాల, రవ్వులు, బొమ్మెలు, బంగారు తీగలాంటి విత్తన చేపలను వదిలారు. ఒకప్పుడు రెండు రకాల చేపలు మాత్రమే లభించేవి. ప్రభుత్వం వేసిన విత్తన చేపలతో తీరొక్క చేపలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వం ఉచిత విత్తన చేప పిల్లలతో 10 వేల మంది మత్స్య కారుల కు టుంబాలకు ఉపాధి దొరికింది. ఆక్వాహబ్ ఏర్పాటుతో మరో 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఏటా కోటి టన్నులే లక్ష్యంగా..
ఆక్వాహబ్లో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్ అమెరికాలోని పలు కంపెనీలతో చర్చలు జరిపారు. ఫిషిన్ ఇండియా, ఫ్రెష్టూహోం, ఆ నందా గ్రూప్, సీపీ ఆక్వా గ్రూప్ సంస్థలు ముందుకొచ్చాయి. ఫిషిన్ ఇండియా కంపెనీ 125 ఎకరాల స్థలంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నది. ఇం దులో భాగంగా మధ్యమానేరు జలాశయంలో స ర్క్యులర్ కేజీస్ను ఏర్పాటు చేసి, కేజ్ కల్చర్ ట్ర యల్ రన్ను చేపట్టింది. కొన్ని విత్తన చేపలను కేజ్కల్చర్లో వేసి ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. రూ. 2వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఆక్వాహబ్ ద్వా రా ఏటా కోటి టన్నుల చేపలను ఎగుమతి చేయాలన్నది లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. సర్కారు మత్స్య కారుల్లో వెలుగులు నింపేందుకు తీసుకుంటున్న చర్యలతో ఆయా కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి.