అంగన్వాడీలతో కలిసి నినదిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి తదితరులు
గంగాధర, మార్చి 25 : సమైక్య పాలనలో ఆగమైన అంగన్వాడీలకు స్వరాష్ట్రంలోనే సముచిత గౌరవం లభించిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్ఘాటించా రు. అడగకముందే టీచర్లు, ఆయాలకు రెట్టింపు వేతనమిచ్చి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. గంగాధర మండలం కురిక్యాలలోని ఓ ఫంక్షన్హాల్లో శనివారం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమాని కి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో హక్కుల కోసం ఉద్యమించిన అంగన్వాడీలను అప్పటి సీఎం చంద్రబాబు గుర్రాలతో తొక్కించిన చరిత్రను మరిచిపోలేదన్నారు. పాలకులు మారినా వారి తలరాత మారలేదన్నారు. వారి కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే వారికి తగిన న్యాయం చేశారని పేర్కొన్నారు. 7 వేలు ఉన్న అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 13,600కు, ఆయాల వేతనాన్ని 4,200 నుంచి 7,800 పెంచారని చెప్పా రు. అలాగే సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేల్ అమలు చేశారని ఘనత ఆయనకే దక్కిందన్నారు.
బూరుగుపల్లిలో సెర్ప్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా మంత్రి కేటీఆర్ ఫోన్లో వారితో మాట్లాడినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గృహలక్ష్మి పథకం కింద అర్హులైన అంగన్వాడీలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆదుకున్న సర్కారుకు అంగన్వాడీ టీచర్లు అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హమాలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, బీవోసి జిల్లా అధ్యక్షుడు మల్లేశం, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, బాబుమియా, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్టీవై జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పవన్బాబు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు, సర్పంచులు వేముల దామోదర్, జోగు లక్ష్మీరాజం, నాయకులు రామిడి సురేందర్, పంజాల ఆంజనేయులు, వడ్లూరి ఆదిమల్లు, లింగాల దుర్గయ్య, చిలుముల రమేశ్, బెజ్జెంకి కల్యాణ్, సముద్రాల అజయ్ పాల్గొన్నారు.
జీతాలు పెంచింది కేసీఆరే
నాడు ఉమ్మడి పాలకులు కార్మికులను పట్టించుకోలేదు. కానీ ప్రమాద బీమా పరిహారాన్ని 2 లక్షల నుంచి 6లక్షలకు పెంచింది కేసీఆరే. గత పాలనలో ఆశ కార్యకర్తలకు 2500కు మించి వేతనం రాలేదు. స్వరాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేనివిధంగా 9750 వేతనం ఇస్తున్నరు. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ పారిశుధ్య కార్మికుల పరిస్థితి దారుణండా ఉండేది. జీతాలు ఉండేవి కాదు. సీఎం కేసీఆర్ 8,500 ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నరు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి జీతాలు పెంచింది కేసీఆరే.
– రాంబాబు యాదవ్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
అంగన్వాడీలకు భరోసా
నాడు రాష్ట్రం ఏర్పాటుకు ముందు అంగన్వాడీల పరిస్థితి దారుణంగా ఉండేది. అప్పటి ప్రభుత్వాలు వెట్టిచాకిరీ చేయించుకోవడమే తప్పా వారికి భరోసా ఇవ్వలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పిలిచి అంగన్వాడీ టీచర్లుగా గుర్తింపునిచ్చి న్యాయం చేశారు. అడగకముందే భారీగా వేతనాలు పెంచారు. అందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్కుఅనుబంధంగా ట్రేడ్ యూనియన్ను ఏర్పాటు చేసుకొని ఆరేండ్లుగా పనిచేస్తున్నాం. మేమంతా కేసీఆర్పై పూర్తి నమ్మకంతో ఉన్నాం.
– నల్ల భారతి, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు