గంగాధర, జూన్ 24: గంగాధర మండలం మంగపేట శివారులోని జగిత్యాల- కరీంనగర్ జాతీయ రహదారిపై రైల్వేగేట్ పడడంతో ఓ అంబులెన్స్ ఆగిపోయింది. బుధవారం ఓ పేషెంట్తో కరీంనగర్లోని దవాఖానకు వెళ్తుండగా.. దాదాపు 20 నిమిషాలపాటు నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ పేషెంట్ బాగానే ఉన్నా..
నిత్యం వేలాది వాహనాలు వెళ్లే ఈ రహదారిలో రోజుకు మూడు నాలుగు సార్లు గేటు పడడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి అరగంటకుపైగా నిరీక్షిస్తున్నారు. ఆపద సమయాల్లో అంబులెన్స్ నిలిచిపోతే ప్రాణాలకు ఎవరిది బాధ్యతని ప్రశ్నిస్తున్నారు. ఇకడ రైల్వే ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.