కొత్తపల్లి, ఏప్రిల్ 20 : రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనానికి నిధులు, మత్స్యకార సొసైటీలో సభ్యత్వాలను మంజూరు చేయిస్తానని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు హామీ ఇచ్చారు. మల్కాపూర్ గ్రామంలో గురువారం ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో కొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ గెలిచినప్పటి నుంచే గ్రామాలకు మహర్దశ పట్టిందని, పట్టణాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు.
మల్కాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనానికి రూ. 5 లక్షలు, చెక్ డ్యాం, మత్స్యకారుల సొసైటీలో నూతన సభ్యత్వాలు మంజూరు చేయిస్తానన్నారు. ముదిరాజ్ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ఏ సమస్య ఉన్న కులస్తులు తనను సంప్రదించాలన్నారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పిట్టల రవీందర్ను ముదిరాజ్ కులస్తులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీ పండుగ నర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లస్మయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పెరుమాండ్ల మహదేవ్, కూన రంజిత్, కొకు భరత్, కూన నాగరాజు, కంకణాల రమేశ్, బొండ్ల శ్యాం, గంగాధర చందు, నాయకుడు గొట్టె పోచయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.