కోనరావుపేట, ఆగస్టు 11: ‘ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలందరూ సంతోషం గా ఉన్నరు. గంప గుత్తగా బీఆర్ఎస్కు ఓటేసేందుకు రెడీ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ ఖాయం’ అని ఎమ్మెల్యే రమేశ్బాబు దీమా వ్యక్తం చేశారు. ప్రజలకు నిస్వార్థమైన సేవలందిస్తున్నామని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. కోనరావుపేట మండలం ధర్మారంలో శుక్రవారం వెయ్యిమంది కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తలతో సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉ మ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలువబోతున్నదన్నారు. వేములవాడ నియోజవకవర్గంలో గులాబీ జెండానే ఎగురుతుందన్నారు. అన్ని సర్వేల్లో అదే తేలిందని చెప్పారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, మైనారిటీ బంధు ను అర్హులందకీ అందిస్తామని, గృహలక్ష్మి లబ్ధిదారులను మరో వెయ్యి మందికి ఇవ్వాలని సీఎం కేసీఆర్ను కోరినట్లు చెప్పారు. రాష్ట్రం రాబంధుల చేతుల్లోకి, మతవాదుల హస్తాల్లోకి వెళ్లకుండా కా పాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నా రు. రానున్న వంద రోజుల్లో పార్టీ యంత్రాంగం కీలకంగా వ్యవహరించాలని, అప్రమత్తంగా లేకపోతే ఆగమైపోతామని సూచించారు. కేసీఆర్ మూడోసారి సీఎం అవుతున్నారని, ఇందులో ఏమాత్రం అనుమానం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే బూత్ కమిటీలు పూర్తి చేసుకుందామని చెప్పారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కోనరావుపేట అగ్రగామిగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో 4 20 కోట్లతో మండలాభివృద్ధి చేసినట్లు చెప్పారు.
ఓటడిగే హక్కు మనకే ఉంది:జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందున్నదని, రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు మనకే ఉందని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. యుద్ధానికి తయారైన సైనికుల్లా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వ పథకాలపై ఇంటింటా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. త్వరలోనే బూత్ కమిటీలు నియమించుకుందామన్నారు. స్వరాష్ట్రంలో కోనరావుపేట మండలం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి, మూడోసారి సీఎంగా కేసీఆర్ను గెలిపించుకుందామన్నారు. అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు అసత్యప్రచారం చేస్తున్నాయని, వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మా ట్లాడుతూ వచ్చే ఎన్నికలు చాలా కీలకం అని, కా ర్యకర్తలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందే లా చూడాలని, చెన్నమనేని రమేశ్బాబును ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మా ట్లాడుతూ స్వరాష్ట్రంలో వేములవాడ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారాయో.. ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ శంకరయ్య, సెస్ వైస్చైర్మన్ తిరుపతి, మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, వైస్ ఎంపీపీ సుమలత, ఆర్బీఎస్ సభ్యులు ప్రతాపరెడ్డి, శంకర్ గౌడ్, కన్వీనర్ ప్రతాపరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పర్షరాం, పార్టీ మండలాధ్యక్షుడు మాల్యాల దేవయ్య ఉన్నారు.