రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల రూరల్ : నేతన్నల నైపుణ్యం దశదిశలా వ్యాప్తి చెంది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలని రాష్ట్ర హైండ్లూం టెక్స్టైల్స్ డైరెక్టర్ అలుగు వర్షిణి ఆకాంక్షించారు. ప్రభు త్వ ఆర్డర్లు లేకున్నా పరిశ్రమ స్వతంత్రంగా ఎదగాలని, అందుకు యజమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆమె సిరిసిల్లను సం దర్శించి మరమగ్గాలపై తయారవుతున్న బతుక మ్మ చీరలను పరిశీలించారు. రోజుకు ఎన్ని మీట ర్లు తయారు చేస్తున్నారు? ఎంత ఆదాయం వ స్తుంది? అని కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీవైనగర్లోని షాదీఖానలో వస్త్ర ఉత్పత్తిదారులతో ఏర్పాటు చేసిన సమీ క్షా సమావేశానికి హాజరై చీరల తయారీపై దిశానిర్దేశం చేశారు. సమైక్య పాలనలో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిన వస్త్ర పరిశ్రమ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ చొరవతో పూర్వవైభవం వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆర్డర్లతో కార్మికులకు, ఆసాములకు నిరంతరం పనిదొరికేలా కృషి చేశారని చెప్పారు.
పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ రెండు నెలల్లో క్లియర్ చేస్తామని చెప్పా రు. యార్న్, ఫ్యాబ్రిక్, అప్పారెల్ విభాగాలలో సై తం రాణించేలా ఉత్పత్తులు చేయాలని చెప్పా రు. మహిళలు వినియోగించే క్వాలిటీ లంగాల ఉత్పత్తులు సిరిసిల్లలో చేపడితే ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. పోచంపల్లి మా దిరిగా ఇక్కడి వస్త్ర ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ అయ్యేలా పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలన్నా రు. అందుకు అన్ని విధాలుగా తమ శాఖ సహాయ సహకారాలందిస్తుందన్నారు. రాజుపాలెం, తిరుపూరు, ఈరోడ్లలో వస్త్ర పరిశ్రమను అధ్యయనం చేసేందుకు ఆసాములు, యజమానులకు సహకా రం అందిస్తామని చెప్పారు. 2022 సంవత్సరం లో మిగిలిన బతుకమ్మ చీరలలో క్వాలిటీ ఉన్న వస్ర్తాలన్నింటిని కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. రాజుపాలెం లాంటి బ్రాండెడ్ క్లాత్ను ఉత్పత్తి చేస్తే టెస్కో సంస్థ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. వస్ర్తోత్పత్తిలో మాడ్రనైజేషన్తో కొత్తదనానికి పెద్ద పీట వేస్తే పెద్ద సంఖ్యలో కార్మికులకు ఉపాధి లభించడంతో పాటు మంచి లాభాలు ఆర్జించవచ్చని సూచించారు. పెండింగ్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని ఆమె చెప్పారు.
టెక్స్టైల్ పార్క్లో
తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్ను అలుగు వర్షిణి సందర్శించగా, టెక్స్టైల్ పార్క్ అధ్యక్షుడు అన్నల్ దాస్ అనిల్, యాజమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్క్లో వస్త్ర ఉత్పత్తి, కుట్టు శిక్షణ, బతుకమ్మ చీరల తయారీ తదితర వస్ర్తాల ఉత్పత్తి తీరు ను పర్యవేక్షించారు. అనంతరం పరిపాలన భవనంలో యాజమానులతో సమావేశమయ్యారు. టెక్స్టైల్ పార్క్లో ఔత్సాహిక పారిశ్రామిక వే త్తులు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని అధ్యక్షుడు అనిల్ వివరించారు. కరెంట్ ఆధారిత పరిశ్రమలు కావడంతో కరెంట్ యూనిట్కు రూ.1 చొప్పున అందివ్వాలని, ఐదేళ్ల పాటు అం దిస్తే పరిశ్రమలు నిలదొక్కుంటాయని, మరింతగా కార్మికులకు ఉపాధి అందించవచ్చని వివరించా రు. టెక్స్టైల్ పార్క్ సమస్యలను ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పా రు. కార్యక్రమంలో సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, టీఎస్పీటీడీసీ చైర్మన్ గూడూ రి ప్రవీణ్, వరంగల్ ఆర్డీడీ అశోక్రావు, ఏడీ సాగర్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, మంచె శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.