Collector Koya Sri Harsha | పెద్దపల్లి, ఏప్రిల్ 18: ఏఐ సాంకేతికత వినియోగించుకోని పనితీరులో వేగం, సామర్థ్యం పెంచాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఏఐ వినియోగంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులు, సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంటూ తమ పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతీ ఒక్కరూ ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను నేర్చుకుని, తమ దైనందిన విధుల్లో అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన, నాణ్యమైన సేవలు అందించే దిశగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్ ఏవో బండి ప్రకాష్, సంబంధిత అధికారుల, శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.