విద్యానగర్, జనవరి 6: ఐదు నెలలుగా రాష్ట్రంలోనే అత్యధికంగా డెంటల్ సర్జరీలు చేస్తున్న దవాఖానగా జిల్లా ప్రభుత్వ దవాఖాన నిలిచింది. ఇందుకు గానూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చొరవతో దవాఖానలో రూ. 3 లక్షల విలువైన ముఖాంభిక కాన్ఫిడెంట్ డెంటల్ చైర్ (అడ్వాన్స్డ్ డెంటల్ చైర్)ను ఏర్పాటు చేశారు. చైర్ను శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రత్నమాల మాట్లాడుతూ, గత ఐదు నెలలుగా రాష్ట్రంలోనే సరాసరిగా నెలకు 60కి పైగా డెంటల్ సర్జరీలతో పాటు అత్యధిక ఓపీలను చూస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం దవాఖానకు అత్యధిక వసతులు కలిగిన చైర్ను అందజేయడం ఆనందంగా ఉందన్నారు. దీంతో ప్రజలకు సేవలు మరింత అందించేందుకు సులభంగా ఉంటుందన్నారు. దీనిని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వాసుదేవారెడ్డి, ఇన్చార్జి ఆర్ఎంవో డాక్టర్ నవీనా, ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సాయిని నరేందర్, ట్రెజరర్ డాక్టర్ వర్షి, డెంటల్ డాక్టర్లు రవి ప్రవీణ్రెడ్డి, ఆర్ శ్రీనివాస్, మంగ, వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.