EVM godown | కరీంనగర్ కలెక్టరేట్, జులై 2 : కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాoను అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గోదాo వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవీఎం గదుల వీవీ ప్యాట్ గదుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో కే మహేశ్వర్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన్, బీఆర్ఎస్ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బీజేపీ ప్రతినిధి నాoపల్లి శ్రీనివాస్, ఎంఐఎం ప్రతినిధి బర్కత్ ఆలీ, టీడీపీ ప్రతినిధి కళ్యాణపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.