పెద్దపల్లి, 4 ఆగస్టు (నమస్తే తెలంగాణ): ప్రజా ప్రతినిధులు, అధికారుల సమష్టి సహకారంతో పెద్దపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని, స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేస్తామని పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ పేర్కొన్నారు. జిల్లాలోని 267గ్రామ పంచాయతీలు, రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో పారిశుధ్యం మెరుగునకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. గత నెల 26న బాధ్యతలు స్వీకరించిన ఆమె, శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
అదనపు కలెక్టర్: ఉమ్మడి జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్నది. జిల్లాల పునర్విభజన తర్వాత పెద్దపల్లి కొత్త జిల్లాగా ఏర్పడింది. అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నది. ఇక్కడి ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారుల సమష్టి ఫలితంగా ఇప్పటికే చాలా జాతీయ అవార్డులను దక్కించుకున్నది. అలాంటి ఉత్తమ జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా.
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నది. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో పయనించడానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నది. ముఖ్యంగా పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం గ్రామాలు, పట్టణాల స్థితిగతులను పూర్తిగా మార్చివేశాయి. ఆ ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకే జిల్లాకు ఒక స్థానిక సంస్థల ప్రత్యేక కలెక్టర్ను నియమించారు. ఆ బాధ్యతల్లో నేను సంపూర్ణంగా అందరి సహాయ సహకారాలతో ప్రభుత్వ ప్రాధామ్యాలే నా ప్రాధామ్యాలుగా ముందుండి పనిచేస్తా.
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాకింగ్లో అత్యుత్తమ ర్యాంకు సాధించాలంటే పారిశుధ్య నిర్వహణ పకాగా అమలు జరగాలి. ఆ దిశగా అధికార యంత్రాగానికి పకడ్బందీగా అమలు జరిగేలా ఆదేశాలు ఇస్తాం. రెగ్యులర్గా పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, ప్రజా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను మరింత చైతన్య వంతం చేస్తూ స్వచ్ఛతలో ముందుకు సాగుతాం.
తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని, నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశాం. అధికార యంత్రాంగం ద్వారా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ప్రజల సహకారంతో చెత్త సమస్యకు చెక్ పెట్టవచ్చు. చెత్త సేకరణకు వచ్చే ఆటో ట్రాలీలకు మాత్రమే చెత్త ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో రహదారులపై, మురుగు కాల్వల్లో పడేస్తే సహించేది లేదు.
మాది జగిత్యాల జిల్లా కొడిమ్యాల. నేను ఇప్పటి వరకు నిర్మల్ ఆర్డీవోగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీఆర్డీఏ పీడీగా, జగిత్యాల జిల్లా డీఆర్డీవోగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా, జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేశా. రాష్ట్ర సచివాలయంలో ఆర్అండ్బీలో పనిచేస్తుండగా ఇటీవల కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా వచ్చా. గత నెల 25న జరిగిన బదిలీల్లో పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బదిలీపై వచ్చా.
రోజూవారీ పారిశుధ్య సేవలకు ఆటంకం లేకుండా చూస్తాం. అవసరమై చోట బ్లీచింగ్ చల్లిస్తాం. గతంలో వర్షాలు, వరదల వల్ల ఎక్కడెక్కడైతే విషజ్వరాలు వ్యాపించాయో..? అలాంటి వాటన్నింటిని గుర్తించి అక్కడ పారిశుధ్య చర్యలు చేపడుతాం. దోమల నివారణకు ఫాగింగ్, రసాయనాల పిచికారీ, మురుగు నిల్వకుండా పారిశుధ్య పనులు చేపడుతాం. ప్రజలు కూడా ముందు జాగ్రత్తలు పాటించాలి. మురుగు నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి.
ప్రభుత్వం చేపట్టిన హరితహారం ద్వారా జిల్లా లో, రాష్ట్రంలో సైతం గణనీయంగా పచ్చదనం పెరిగింది. ఏటా లక్ష్యాలకు అనుగుణంగా మొ కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే లా శ్రద్ధ తీసుకుంటాం. ఈవర్షాల్లో భారీగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మ డి జిల్లా డీఆర్డీఏ పీడీగా పనిచేసిన సమయంలో మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో విసృతంగా కార్యక్రమాలు నిర్వహించాం. జిల్లాతో మంచి అనుబంధం ఉంది. చాలా వరకు అధికారులతో పరిచయాలు కూడా ఉన్నాయి. అవన్నీ నా పనితీరుకు ఎంతగానో ఉపయోగ పడుతాయి.