తెలంగాణ చౌక్, ఫిబ్రవరి 8: ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని డిపో మేనేజర్లకు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ వెంకటేశ్వర్లు సూచించారు. కరీంనగర్ జోనల్ పరిధిలో ట్రాఫిక్ విభాగంలో పని చేసి ఉద్యోగోన్నతి పొందిన డీఎంలకు బుధవారం జోనల్ వర్క్షాపులో డిపోల నిర్వహణపై వరంగల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ఏఎంఈ మోహన్రావు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అనంతరం బస్టాండ్ కాంప్లెక్స్లోని ఈడీ కార్యాలయంలో డిపో మేనేజర్లతో సమీక్షా సమాశం నిర్వహించారు. ప్రయాణికులే సంస్థకు నిధి అని, వారితో మర్యాదగా వ్యవహరించాలని కోరారు. ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీకి అనుగుణంగా అవసరమైతే అదనపు బస్సులను నడుపాలని నిర్దేశించారు.
బస్సుల నిర్వహణ, డిపో మెకానిక్, ఫోర్మెన్స్ ఇతర సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ సంస్థను లాభాల బాటలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు జనగాం-జ్యోత్స్న, నర్సంపేట విజయమాధురి, తొర్రూర్-పరిమళ, సత్తుపల్లి- రాజ్యలక్ష్మి, మణుగూర్-టీ స్వామి, ఆర్మూర్- కవిత, బోధన్-టీఎస్ స్వామి, ఆదిలాబాద్- కే కవిత, మంచిర్యాల- రవీంద్రనాథ్, ఈడీ సెక్రటరీ యుగేంధర్రెడ్డి, మెకానికల్ సూపర్వైజర్ గోపాల్రెడ్డి పాల్గొన్నారు.