రాంనగర్, ఫిబ్రవరి 13: శామీర్పేట తహసీల్దార్ తోడేటి సత్యనారాయణ రూ.10 లక్షలు తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడగా ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కరీంనగర్లోని హిందూపురికాలనీలో గల ఆయన నివాసం, విద్యానగర్లోని అతని బంధువుల నివాసాల్లో సోదాలు చేశారు.
సత్యనారాయణ భార్య రేణుక జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూర్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నది. ఆమెను కూడా ఏసీబీ పోలీసులు విచారించి పలు డాక్యుమెంట్లను పరిశీలించి సమాచారం సేకరించారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి.