Korutla | కోరుట్ల : స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని విహారయాత్ర కు వెళ్లిన యువకుడు కర్ణాటకలోని విభూత జలపాతం లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలో అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కోరుట్ల మున్సిపాలిటీలో విలీనమైన ఎకీన్ పూర్ గ్రామానికి చెందిన శీలం అజయ్ (25) ఇటీవల దుబాయ్ నుండి ఇటీవల వచ్చాడు.
హైదరాబాద్ చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం కర్ణాటకలోని విభూత జలపాతంలో అజయ్ గౌడ్ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా అజయ్ మృతదేహం లభ్యమైంది. ఎకిన్ పూర్ చెందిన శీలం వెంకటేష్- లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు అజయ్ గౌడ్. చేతికి వచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.