కరీంనగర్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు దళితబంధు పథకం చకని మార్గం అని గూగుల్ టీమ్ లీడర్ గౌరవ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో దళితబంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన అమెరికన్ టూరిస్టర్ షాపును ఆయన నేతృత్వంలోని గూగుల్ బృందం గురువారం సందర్శించింది. షాపును నడిపిస్తున్న తీరును సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గూగుల్ బృందం లీడర్ మాట్లాడుతూ ప్రతి ఒకరూ నాణ్యమైన వస్తువుల కోసం ప్రాధాన్యత ఇస్తారని, దళితబంధు ద్వారా ఏర్పాటు చేసిన అమెరికన్ టూరిస్టర్ షాప్లో నాణ్యమైన వస్తువులు అమ్ముతున్నారని, చాలా బాగా నడుస్తుందని చెప్పారు. లబ్ధిదారుడికి అవసరమైన వ్యక్తిగత సహకారం గూగుల్ టీం అందిస్తుందని హామీనిచ్చారు.
ఈ షాపు నిర్వహణ అనుభవంతో ప్రజల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా కరీంనగర్లోనే మల్టీ బ్రాండెడ్ షోరూమ్ ఏర్పాటు చేసేందుకు అమెరికన్ టూరిస్టర్ షాప్ నిర్వాహకులు ప్రణాళిక రూపొందించుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా షాప్ అసిస్టెంట్ మేనేజర్, స్టోర్ ఇన్చార్జ్ అజయ్ మాట్లాడుతూ రాజరాజేశ్వర ఎస్టాబ్లిష్ అమెరికన్ టూరిస్టర్ తరుఫున 2022 జూన్ 19న కరీంనగర్లో ఏర్పాటు చేశామని చెప్పగా, ఈ షాపు దళితబంధు పథకంలో ఆదర్శంగా నిలిచిందని గూగుల్ సభ్యులు అభినందించారు. అనంతరం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసును గూగుల్ టీం కలిసింది. ఈ సందర్శనలో బెంగళూరు, హైదరాబాద్కు చెందిన గూగుల్ బృందం సభ్యులు ఇషాన్ దేశ్ పాండే, నిహారికరెడ్డి, దినేష్ తివారి పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ వీరికి గైడ్గా వ్వవహరించారు.