విద్యానగర్, ఫిబ్రవరి 1: వైద్య రంగంలో ఆధునిక టెక్నాలజీ, ఆధునిక చికిత్సా పద్ధతులు, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధికి వైద్య సదస్సులు దోహదం చేస్తాయని కరీంనగర్ రూరల్ ఎసీపీ కరుణాకర్రావు అన్నారు. కరీంనగర్లోని రేనె హాస్పిటల్లో లైవ్ సర్జరీ ప్రోగ్రాంలో భాగంగా చేపడుతున్న 9వ తెలంగాణ రాష్ట్ర ఆర్థోపెడిక్ సర్జన్ల సదస్సును గురువారం రెనీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి, ఎండీ రజని, ఫెర్టిలిటీ సెంటర్ ఫౌండర్ డాక్టర్ బంగారి రజనీప్రియదర్శినితో కలిసి ఏసీపీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సదస్సులను డాక్టర్లు వినియోగించుకోవాలని సూచించారు. రెనీ హాస్పిటల్లో ఆర్థో స్కోపి, టోటల్ హిప్ రిప్లేస్మెంట్ లైవ్ సర్జరీలను బంగారి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎండోస్కోపి, స్పైన్ సర్జరీని డాక్టర్ కేతన్ దేశ్పాండే, డాక్టర్ పవన్కుమార్, డాక్టర్ సూర్య ప్రకాశ్, సురేశ్ చీకట్ల, డాక్టర్ రాజు అయ్యంగార్, పీజీ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతిమ కళాశాలలో రోబోటిక్ ద్వారా మోకాలు కీలు మార్పిడి లైవ్ సర్జరీ చేశారు. చైర్మన్ మోతీలాల్, ఆర్గనైజర్ డాక్టర్ ముఖేశ్ లడ్డా, కో ఆర్గనైజర్ డాక్టర్ అభిలాష్తోపాటు డాక్టర్ నీల రమణారెడ్డి, ప్రవీణ్రావు, ఆర్థోపెడిక్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. శ్వేత కాన్ఫరెన్స్ హాల్లో పెల్వి ఎసీటాబులం సర్జరీలో డాక్టర్లు ఉదయ్కుమార్, వంశీధర్రెడ్డి, నర్సింహాలు, శివకుమార్, అశోక్రాజు, అతుల్, నాగరాజు, వంశీచిట్ల పాలుపంచుకున్నారు.