కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 29 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన డీఎస్సీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 823 పోస్టులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా జగిత్యాల జిల్లాలో సూల్ అసిస్టెంట్ 99, లాంగ్వేజ్ పండిట్ 39, ఫిజికల్ ఎడ్యుకేషన్ 8, సెకండరీ గ్రేడ్ టీచర్ 161, అలాగే సూల్ అసిస్టెంట్ 5, సెకండ్ డిగ్రీ టీచర్ 22, మొత్తం కలిపి 334 పోస్టులు కేటాయించారు. కరీంనగర్ జిల్లాలో సూల్ అసిస్టెంట్ 86, లాంగ్వేజ్ పండిట్ 18, ఫిజికల్ ఎడ్యుకేషన్ 114, స్పెషల్ ఎడ్యుకేటర్లు సూల్ అసిస్టెంట్ 5, సెకండరీ గ్రేడ్ టీచర్ 15, మొత్తం 245 కేటాయించారు.
పెద్దపెల్లి జిల్లాలో సూల్ అసిస్టెంట్ 49, లాంగ్వేజ్ పండితులు 5, ఫిజికల్ ఎడ్యుకేషన్ 1, సెకండరీ గ్రేడ్ టీచర్ 21, స్పెషల్ ఎడ్యుకేషన్లో సూల్ అసిస్టెంట్ 5, సెకండ్ డిగ్రీ టీచర్ 12, మొత్తం 93 పోస్టులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సూల్ అసిస్టెంట్ 56, లాంగ్వేజ్ పండిట్ 12, ఫిజికల్ ఎడ్యుకేషన్ 4, సెకండరీ గ్రేడ్ టీచర్ 67, సూల్ అసిస్టెంట్ విభాగంలో మూడు టీచర్ 9 మొత్తం 151 పోస్టులు కేటాయించారు. అయితే, ఈ పోస్టులన్నీ గత ప్రభుత్వంలో నివేదికల ఆధారంగా కేటాయించినట్లు తెలుస్తోంది.