ఎండలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా ఉంటున్నాయి. ఉదయం పది గంటలకే మొదలవుతున్న ఎండ మధ్యాహ్నం వరకు క్రమంగా పెరుగుతోంది.
పగలంతా వేడి గాలులు వీస్తున్నాయి. దిన దినం హీటెక్కుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారయంత్రాంగం సూచిస్తోంది. మార్చి నెలాఖరులో ఒకట్రెండు రోజులు మినహా అత్యధిక ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటలేదు. ఇప్పుడు 40 డిగ్రీలు నమోదైతే మున్ముందు పరిస్థితి ఎలా ఎంటుందో అర్థం చేసుకోవచ్చు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్