మల్యాల, జూలై 24: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండంలోని మానాల, లంబాడీపల్లి, తక్కళ్లపల్లి గ్రామాలకు చెందిన 40మంది యువకులు ఆదివారం టీఆర్ఎస్వీ నాయకులు మధుసూదన్రెడ్డి, సతీశ్రెడ్డి, మునుగూరి రాకేశ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్రావు, టీఆర్ఎస్ అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చెర్మన్ ఆసం శివకుమార్, ముత్యంపేట సర్పంచ్ బద్ధం తిరుపతిరెడ్డి, నాయకులు తాటిపాముల జగదీశ్వర్, అల్లూరి రాజేశ్వర్రెడ్డి, కొంక నర్సయ్య, కాటిపల్లి శ్రీనివాస్రెడ్డి, ఆగంతం వంశీధర్, పూడూరి చందు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.