కొత్తపల్లి, జూన్ 29: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పల్లె ప్రగతి, హరితహారం విజయవంతం చేయాలని ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్ కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం హరితహారం పోస్టర్ను ఆవిష్కరించారు. ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సంపత్, ఎంపీవో దొంతి శ్రీనివాస్, ఏపీవో స్పందన, ఎంపీటీసీలు పండుగ గంగవ్వ, పట్టం శారద, సర్పంచులు జినుక సంపత్, రాచమల్ల మధు, షర్మిల, శాంత, మండల కో-ఆప్షన్ సభ్యుడు షరీఫ్, ఏఈలు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జూన్ 29: పల్లె ప్రగతి కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, మండల ప్రత్యేకాధికారి మధుసూదన్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో పల్లెప్రగతి, హరితహారంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ఎంపీడీవో పవన్కుమార్, ఎంపీవో రాజగోపాల్రెడ్డి, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ సంపత్కుమార్, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఎంపీటీసీలు బుర్ర తిరుపతి గౌడ్, సాయిల వినయ్ సాగర్, సర్పంచులు పురుమల్ల శ్రీనివాస్, ఊరడి మంజుల, మడికంటి మమత, దుర్గా, అట్ల సంతోష, చామనపల్లి అరుణ, మండల కో- ఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, జూన్ 29: మండలంలో పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతంగా చేపట్టి మార్గదర్శకంగా నిలవాలని ఎంపీపీ కలిగేటి కవిత పిలుపు నిచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు పల్లె ప్రగతిపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. జడ్పీటీసీ మార్కొండ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సతీశ్రావు, నాయబ్ తహసీల్దార్ కిరణ్కుమార్రెడ్డి, రామడుగు, గుండి పీహెచ్సీ వైద్యాధికారులు, శ్రీనివాస్, సురేశ్ తదితరులు ఉన్నారు.