పార్టీలకతీతంగా టీఆర్ఎస్లోకి చేరికలు
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి గులాబీ గూటికి బీజేపీ ఎంపీటీసీ
పెద్దపల్లి రూరల్, నవంబర్ 28: సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులయ్యే పార్టీలకతీతంగా పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం పెద్దపల్లి మండలంలోని బీజేపీకి చెందిన హన్మంతునిపేట ఎంపీటీసీ గుర్రాల లక్ష్మి-గట్టేశం దంపతులు వారి అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలతో ముందుకు సాగుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం రైతులను నష్టాల బాటలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. వరి పంటల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను గమనిస్తూ రైతులు తెలంగాణ ప్రభుత్వం సూచిస్తున్న విధంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల సదయ్య, మాజీ ఉప సర్పంచ్ మేకల లక్ష్మణ్ యాదవ్, పెద్దపల్లి సింగిల్ విండో డైరెక్టర్ మేకల కుమార్యాదవ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కనుకయ్య, నాయకులు బండి సతీశ్, కందుల శ్రీనివాస్, పూదరి శ్రీనివాస్, నాగేశ్వర్రావుతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.