నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు
గూడెంలో వ్యవసాయ గోదాం నిర్మాణానికి భూమిపూజ
ముస్తాబాద్, సెప్టెంబర్ 27: రైతు చెంతకే సేవలందిస్తూ సహకార సంఘాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. పోత్గల్ సహకార సంఘం ఆధ్వర్యంలో గూడెంలో ఎరువు ల గోదాముతోపాటు దుకాణల సముదాయానికి చైర్మన్ తన్నీరు బాపురావు, సర్పంచ్ చిట్నేన్ని సరిత, ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం భూమి పూజ చేశారు. తర్వాత పోత్గల్ చైర్మన్ తన్నీరు బాపురావు అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. చైర్మన్ బాపురావు, పాలకవర్గ కృషితో సంఘం ప్రగతి పథంలో ముందువరుసలో ఉందన్నారు. ఖాతాదారులు, సంఘం సభ్యులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. అన్నదాతలకు బహుముఖ సేవలందిస్తూ అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. అంతకు ముందు కేడీసీసీబీ ముస్తాబాద్ బ్రాంచ్ వారు అందించిన రూ.25లక్షల రుణంతో ఏర్పాటు చేసిన సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రాన్ని, రూ.22లక్షల రుణంతో నిర్మించిన సిమ్మింగ్ ఫూల్ను ప్రారంభించారు. సేవాలాల్తండాకు చెందిన కట్ట సురేందర్ రూ.10లక్షలతో కారు కొనుగోలు చేయగా, అందజేశారు. తర్వాత సంఘం చైర్మన్ బాపురావును పాలకవర్గం సభ్యులతో కలిసి సన్మానించారు. ఇక్కడ పీఏసీఎస్ వైస్ చైర్మన్ మేర్గు రాజేశంగౌడ్, ఆర్బీఎస్ కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు, ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఏఎంసీ చెర్పర్సన్ శీలం జానాబాయి, పీఏసీఎస్ చైర్మన్ అన్నం రాజేందర్రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు సాదుల్పాషా, మాజీ జడ్పీటీసీ మేర్గు యాదగిరిగౌడ్, సెస్ మాజీ డైరెక్టర్ విజయరామారావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు చిట్నేన్ని అంజన్రావు, బత్తుల అంజయ్య, యాది మల్లేశ్యాదవ్, సర్వర్పాషా, గూడెం ఉప సర్పంచ్ చాడ శ్రీనివాస్, నర్సింహారెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాస్రావు, సర్పంచులు గాండ్ల సుమతి, తన్నీరు గౌతంరావు, రవీందర్రెడ్డి, చాకలి రమేశ్, బద్ది కల్యాణి, బ్యాంకు మేనేజర్లు దామోదర్, శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు వాల హన్మంతరావు, సతీశ్చందర్రావు, లక్ష్మణ్రావు, మాధవరావు, కట్ట బాపురావు, కుర్ర కీర్తన్, వెంకట్రెడ్డి, అయినేని వెంకట్రెడ్డి, గన్నె నర్సింహులు, బైరి బాలవ్వ, సీఈవో కృష్ణ తదితరులు ఉన్నారు.