జగిత్యాల, మార్చి 26 : పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొకల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డు పురసారాల్లో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉత్తమంగా నిలిచిన 27 గ్రామ పంచాయతీలకు జగిత్యాలలోని కలెక్టరేట్లో ఆదివారం ప్రశంసా పత్రాలను అందజేసి, మంత్రి మాట్లాడారు. సర్పంచులు, అధికారులు సమష్టిగా కృషిచేయడం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం, ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, కంపోస్టు షెడ్లు, నర్సరీలు, వైకుంఠ ధామాల నిర్మాణం వంటి వసతులు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలను ప్రకటిస్తే అందులో 19 తెలంగాణ రాష్ట్రానికి చెందినవి కావడం గర్వకారణమన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వంద శాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు, ప్రజాప్రతినిధులు మరింత చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందిన మన గ్రామాలను చూసి దేశం ఆశ్చర్యపోతున్నదన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మా ట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమంగా నిలిచిన గ్రామ పంచాయతీలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు ముం దుకు సాగాలన్నారు. కలెక్టర్ యాస్మిన్ బాషా మా ట్లాడుతూ ఉత్తమ పంచాయతీలుగా ఎంపికయ్యేందుకు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.