పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
200 మంది టీఆర్ఎస్లో చేరిక
పెద్దపల్లి జంక్షన్, డిసెంబర్ 26: సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని 8వ వార్డు పరిధిలోని ఎంఐఎం, కాంగ్రెస్కు చెందిన సయ్యద్ సాజిద్, ఎంఏ ఇస్మాయిల్, సయ్యద్ వాజిద్, ఎస్కే ఖాజా, ఎస్కే సమీర్, ఎండీ అఖిల్ఖాన్, ఎండీ రఫీ, ఎస్కే సుమేర్, ఎండీ అతిక్, ఎండీ అక్బర్తోపాటు 200 మంది యువకులు, ముస్లింలు, మహిళలు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నదని పేర్కొన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వందల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆలోచనతోనే పెద్దపల్లి పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడిందని, 70 ఏండ్లలో జరుగని అభివృద్ధి కేవలం ఏడేండ్లలో సాధ్యమైందని పేర్కొన్నారు. పట్టణవాసులకు ఏమైనా సమస్యలుంటే తనకు ఫోన్ చేయాలని సూచించారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం పలువురు తమ వార్డులో మురికి కాలువలు, రోడ్లు వేయాలని విజ్ఞప్తి చేయగా, ఎమ్మెల్యే పరిసరాలను పరిశీలించి, త్వరలోనే సదరు పనులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్, మున్సిపల్ కో -ఆప్షన్ మెంబర్ ఫహిం, నాయకులు గజవెల్లి పరుషోత్తం, వడ్డెపల్లి లక్ష్మి, జాపా నాగలక్ష్మి, బొంకూరి సుభాష్, అజిద్, ఖాదర్, ఖదీర్ ఖాన్, బొద్దుల విజయ, సంటి సుమ, వెన్నం రవి, ఇస్మాయిల్, ముత్యంరెడ్డి, ఖాజామొహినొద్దీన్, మాటేటి తిరుపతి, కృష్ణారెడ్డి, మల్లేశం, బొంకూరి నవీన్, మాదారపు వంశీ, కుమ్మరి అరవింద్, బొంకూరి సుచిత్ర, కుక్క రాజేశ్వరి, అరపెల్లి శారద, కాసిపాక సుగుణ, వినోద తదితరులు పాల్గొన్నారు.