తెలంగాణచౌక్, డిసెంబర్ 26: బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి పేర్కొన్నారు. నగరంలోని సీపీఐ కార్యలయం (బద్ధం ఎల్లారెడ్డి భవనం)లో ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేదారి మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, కార్మిక, కర్షకుల ప్రయోజనాలను కాపాడడానికి సీపీఐ నిరంతరం ఉద్యమాలను కొనసాగిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారదత్తం చేస్తున్నదని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాల కంటే బడా వ్యాపారుల శ్రేయస్సు కోసం పని చేస్తున్న బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్కుమార్, టేకుమల్ల సమ్మయ్య, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, బూడిద సదాశివ, మణికంఠరెడ్డి, నాయకులు మల్లవ్వ, పైడి రాజు, పద్మ, సంతోష్, కడారి ఐలయ్య, కాల్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, డిసెంబర్ 26: మండలంలోని దేశరాజ్పల్లి, గుండి, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఆదివారం సీపీఐ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్కుమార్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ సంస్థలకు అనుకూల నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రగతిశీల ఉద్యమాలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఉమ్మెంతల రవీందర్రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు గొడిశల తిరుపతిగౌడ్, మచ్చ రమేశ్, నాయకులు వేముల మల్లేశం, నర్సయ్య, రవీందర్, హరీశ్, రాజయ్య, కనకయ్య, రాజేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.