జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
టీఆర్ఎస్లో పలువురు కాంగ్రెస్ నాయకుల చేరిక
సారంగాపూర్, డిసెంబర్ 25 : తెలంగాణ అభివృద్ధికి నాయకులంతా కలిసికట్టుగా కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పిలుపునిచ్చారు. క్యాంప్ కార్యాలయంలో శనివారం గ్రామాధ్యక్షుడు దొనకంటి తిరుపతి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరిన పలువురికి ఎమ్మెల్యే సంజయ్కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలోని రంగపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ సర్పంచ్ చంద రమేశ్ సహా నాయకులు శంకర్, నర్సయ్య, దామోదర్, అంజన్న, రాజేశ్, తిరుపతి, గంగమల్లు, అనంతరావు, లింబాద్రి, సైద రాజు, చిన్న నర్సయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీఆర్ఎస్ రైతు పక్షపాతి ప్రభుత్వమని, కేసీఆర్ నిర్ణయాల వల్ల తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదన్నారు. జగిత్యాల నియోజక వర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల నేడు సమస్య తలెత్తిందని రైతులు ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి, జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, వెంకటరమణా రావు, ఢిల్లీ రామారావు, తదితరులు పాల్గొన్నారు.