మానకొండూర్, డిసెంబర్ 24 : గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషిచేయాలని డీఆర్డీవో శ్రీలత రెడ్డి సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ-2021లో భాగంగా మండల కేంద్రంలో ఐదు గ్రామైక్య సంఘాల సభ్యులకు సమావేశం ఏర్పా టు చేశారు. ఆమె హాజరై మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో దివ్యదర్శన్రా వు, డీపీఎం ఐబీ శ్రీనివాస్, ఎస్బీఎం జిల్లా కోఅర్డినేటర్ కిషన్స్వామి, ఫెసిలిటేటర్ కల్యాణి, ఐకేపీ ఏపీఎంలు నిరంజన్, సంతోష్రావు,కార్యదర్శి తుల్జారాణి, సీసీ జ్యోతి, వీవోలు ఎండీ అబీదాబేగం, పద్మ, కనకలక్ష్మి, గీత, స్వప్న, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
శంకరపట్నంలో..
శంకరపట్నం, డిసెంబర్ 24: మహిళలు నెలసరి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో జయశ్రీ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ-2021లో భాగంగా అన్ని గ్రామాల్లో ఎస్బీఎం ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ, మహిళలు, కిశోర బాలికలు నెలసరి సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సెర్ప్ డీపీఎం నర్సింహు లు, ఎస్బీఎం కో ఆర్డినేటర్ టీ రమేశ్, సర్పంచ్ కీసర సు జాత, ఏపీఎం సుధాకర్, కార్యదర్శి సమ్మ రాజేశ్వ ర్, సీసీలు సంపత్, రాజు, తిరుపతి, అజీమ్, లక్ష్మీనారాయణ, అంగన్వాడీ టీచర్లు, వీవోఏలు, ఆశ కార్యకర్తలు, ఎస్హెచ్జీ మహిళలు పాల్గొన్నారు.
ఇందుర్తిలో..
చిగురుమామిడి, డిసెంబర్ 24: ఇందుర్తిలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2021 ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత అంటువ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. పంచాయతీ వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, సీఏలు, కార్యదర్శి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొంటే కొంత వరకు రోగాలను నివారించవచ్చన్నారు. సర్పంచ్ అందె స్వరూప, కార్యదర్శి వెంకటరమణారెడ్డి, అంగన్ వాడీ టీచర్లు విజయ, సరస్వతి, మావురమ్మ, ఇందిర, ఐకేపీ సీసీ వెంకటేశ్వర్లు, సీఏలు కత్తి లావణ్య, బుర్ర శోభ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
రేణికుంటలో..
తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 24: రేణికుంట గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా పరిశుభ్రతపై మహిళలకు అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బోయిని కొమురయ్య సూచించారు. తడి, పొడిచెత్త ట్రాక్టర్లో వేయాలన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహకారంతో గ్రామంలో చెత్తను వేసేందుకు డంప్యార్డు ఏర్పాటు చేశామన్నారు. కార్యదర్శి రమేశ్, ఐకేపీ సీసీ రంజిత్, సీఏ శ్రీధర్, శ్రీనివాస్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.