శాంతా క్లాజ్ వేషధారణలో చిన్నారులు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కమాన్చౌరస్తా, డిసెంబర్ 24: జిల్లా కేంద్రంలోని పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో శుక్రవారం ముందస్తు క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ సూల్ ఆఫ్ జెన్ నెక్ట్స్ పాఠశాలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి మాట్లాడారు. ఇలాంటి వేడుకల ద్వారా సంతోషం వెల్లువిరుస్తుందని, సోదరభావం పెంపొందుతుందని చెప్పారు. అనంతరం క్రిస్మస్ తాత వేషధారణలో వచ్చిన చిన్నారి కేక్ కట్ చేశారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
పారమిత విద్యాసంస్థల ఆధ్వర్యంలో..
పారమిత హెరిటేజ్ పాఠశాలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో విద్యాసంస్థల చైర్మన్ ఈ ప్రసాద్ రావు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంబురాల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు క్రిస్మస్ చెట్టు తయారీ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అలాగే, పొన్నం కాంప్లెక్స్లోని పారమిత లెర్నన్ ఫౌండేషన్ పాఠశాలలో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, వివిధ వేషధారణలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో పాఠశాల డైరెక్టర్లు రష్మిత, వినోద్రావు, ప్రసూన, అనుకర్ రావు, రాకేశ్, వీయూఎం ప్రసాద్, ప్రిన్సిపాళ్లు అశువాద్వా, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నగరంలోని జాన్సన్ గ్లోబల్ హైసూల్లో డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో కరస్పాండెంట్ ఊటూరి మహేందర్ రెడ్డి, డైరెక్టర్లు ఎంవీ వరప్రసాద్, కే రాంరెడ్డి, వంగల సంతోష్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హనుమాన్నగర్లోని బ్లూబెల్స్ పాఠశాలలో క్రిస్మస్ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. ప్రత్యేక దుస్తుల్లో వచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే, అలకాపురి కాలనీలోని వీ కిడ్స్ ప్లే స్కూల్లో విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్ మామిడి జ్యోతి, కార్తీక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాంనగర్లోని వేదం పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ విశిష్టతను పాఠశాల చైర్మన్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఇక్కడ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే, జిల్లా కేంద్రం శివారులోని ఐటీ హబ్లో గల ఇండస్ట్రీ ఏఆర్సీ సంస్థలో క్రిస్మస్ సంబురాలు అట్టహాసంగా సాగాయి. కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సంస్థ సీఈవో జాప వెంకట్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఆర్ వీ రవళి, ఐటీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, డిసెంబర్ 24 : కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలో శుక్రవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు విద్యార్థులు దేవదూతలు, శాంతాక్లాజ్ వేషధారణలో ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో క్రిస్మస్ ట్రీని అందంగా ముస్తాబు చేశారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కేక్ను మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్24: మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు క్రిస్మస్ తాత వేషధారణలో ఆకట్టుకున్నారు. ఆటాపాటలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీధర్, సిబ్బంది శ్రీ విద్య, ఎం రాజు, కృష్ణారావు, ఏవో జ్యోతి, విజయకృష్ణ పాల్గొన్నారు.