చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
తాటిపల్లి పెద్ద చెరువులో 58 వేల చేపపిల్లల పంపిణీ
మల్యాల, డిసెంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తూ తెలంగాణలోని మత్స్యకారుల అభ్యున్నతికి పాటుపడుతున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శుక్రవారం తాటిపల్లి గ్రామంలోని ఖజానా- పెద్దచెరువులో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 58 వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను వదలడంతోపాటు వాటిని విక్రయించుకొని ఉపాధి పొందేందుకు గంగపుత్ర, ముదిరాజ్ కులస్తులకు సబ్సిడీపై వాహనాలు అందజేస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ బింగి జ్యోత్స్న, మత్స్యశాఖ ఏడీఏ నర్సింగరావు, ఫీల్డ్ ఆఫీసర్స్ జయశ్రీ, కార్తీక్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, సహకార సంఘ అధ్యక్షులు ముత్యాల రాంలింగారెడ్డి, అయిల్నేని సాగర్రావు, వివిధ గ్రామాల సర్పంచులు కట్కూరి తిరుపతి, రాసమల్ల హరీశ్, నాయకులు బింగి వేణు, పొన్నం మల్లయ్య, పంబాల సర్సయ్య, జనగం శ్రీనివాస్, ఆసం శివకుమార్, అయిల్నేని కోటేశ్వర్రావు, గడ్డం మల్లారెడ్డి, జున్న సురేందర్, మారంపల్లి నారాయణ, క్యాతం భూపతిరెడ్డి, జంగిలి హన్మంతు, ఆకుల నగేశ్, ముత్యాల నరసింహారెడ్డి, ఆగంతం వంశీ, మరాఠి గంగారెడ్డి, దుర్గయ్య, మ్యాక లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.