వెల్గటూర్, డిసెంబర్ 24 : అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ధ్యే యమని, మైనార్టీల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని రాజారాంపల్లిలోగల ఎస్ఆర్ గార్డెన్లో శుక్రవారం నియోజకవర్గస్థాయి క్రిస్మస్ వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. మొదట నియోజకవర్గంలోని మూడు వేల మందికి దుస్తులు, గిప్టులను జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, కలెక్టర్ రవి తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దసరాకు మహిళలకు చీరలు, రంజాన్కు ముస్లింలకు కొత్త బట్టలు, క్రిస్మస్కు కానుకలు, బట్టలు అందజేస్తున్నామని, ఇది సీఎం కేసీఆర్ ఘనత అని కొనియాడారు. నియోజకవర్గంలో చర్చిల నిర్మాణం, అభివృద్ధికి నిధులు అందజేశామని, అందరికి అండగా ఉం టానని తెలిపారు. హైదరాబాద్లో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి కోకాపేటలో 2ఎకరాల స్థ లాన్ని కేటాయించి, నిధులు మంజూరు చేసిన ఘనత మన ప్రభుత్వానిదేనని, మైనారిటీల కోసం రాష్ట్రంలో 104 పాఠశాలలను ప్రారంభించామని గుర్తుచేశారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ అన్ని మతాల వా రు కలిసి ఉండడాన్ని చూడలేని బీజేపీ నాయకులు మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని, అలాంటి వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధారాణి, సర్పంచ్ శేఖర్, పాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు సింధూజరెడ్డి, జిల్లా అధికారి సుందరవరదరాజన్, నరేశ్, క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవు లు, మహిళలు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.