ఫర్టిలైజర్సిటీ, నవంబర్ 24: గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను చైర్మన్, ఇద్దరు సభ్యులతో కూడిన నాక్ బృందం బుధవారం సందర్శించింది. ఈ టీంకు చైర్మన్గా కర్ణాటకకు చెందిన రాణి చెన్నవా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రగౌడ వ్యవహరిస్తున్నారు. తమిళనాడుకు చెందిన మదర్ థెరిస్సా మహిళా విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ ప్రేమలత, ఉత్తరఖాండ్కు చెందిన చిన్మయ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు అలోక్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఉదయాన్నే కళాశాలకు చేరుకున్న వీరికి అధ్యాపకులు, విద్యార్థులు బతుకమ్మలు, బోనాలు, పీరీలతో తెలంగాణ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాశాల ప్రగతిని ప్రిన్సిపాల్, కో-ఆర్డినేటర్ భాషా వారికి వివరించారు. బృందం బాధ్యులు ప్రాంతీయ అదనపు సంచాలకులు యాదగిరితో సమావేశమయ్యారు. అంతకుముందు కళాశాల ఆవరణలో కలియదిరిగారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ యూనిట్లు. ప్రయోగశాలలను పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై ఐదేండ్లలో చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఇక్కడ సురేశ్, గడ్డం శ్యాం, జెట్టి రాము, అజయ్కుమార్, నాగేశ్వరరావు, నరేశ్, రాజేశ్, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, సంగీత, శ్రీదేవి, సిబ్బంది ఉన్నారు.