ఒక్కరోజే లక్షలాది మొక్కలు నాటేందుకు రెడీ
చొప్పదండి మండలం వెదురుగట్టలో పాల్గొననున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్
చింతకుంటలో మొక్కలు నాటనున్న మంత్రి గంగుల
ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి : మండలి విప్ భానుప్రసాద్రావు
కరీంనగర్, జూలై 23 (నమస్తే తెలంగాణ) ; ఏటా తన పుట్టిన రోజు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న మంత్రి కేటీఆర్కు అభిమానులు ఈసారి బర్త్డే సందర్భంగా హరిత కానుక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని చింతకుంటలో మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి మండలం వెదురుగట్టలో నిర్వహించనున్న కోటి వృక్షార్చన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై పదివేల మొక్కలు నాటనున్నారు. మానకొండూర్ నియోజకవర్గంలో 3 లక్షలు నాటనుండగా, ఇల్లందకుంటలో ఎమ్మెల్యే రసమయి పాల్గొనున్నారు.