జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
కులాంతర వివాహం చేసుకున్న ఆరుగురికి రూ.2.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందజేత
జగిత్యాల రూరల్, డిసెంబర్ 22 : అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో బతికేందుకే ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్లో కులాంతర వివాహాలు చేసుకున్న ఆరుగురు వధూవరులకు ప్రభుత్వ ప్రోత్సాహకం ఒక్కొక్కరికీ రూ.2.50లక్షల చొప్పున మొత్తం రూ.14లక్షల చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇదొక గొప్ప కార్యక్రమమని, దళితులను ఇతర కులాల వారు వివాహం చేసుకుంటే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందని, దీంతో వారు జీవితంలో స్థిరపడేందుకు ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సాహకంతో పాటు కల్యాణలక్ష్మి కూడా వర్తిస్తుందన్నారు. దళిత వర్గాల కోసం ముఖ్యమంత్రి దళిత బంధు అనే గొప్ప పథకం తీసుకురావడం ద్వారా దళితులు కార్మికుల నుంచి ఓనర్గా మారే అవకాశాన్ని కల్పించారన్నారు. ప్రతిపక్షాలు దళిత బంధును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే సీఎం కేసీఆర్ పర్యటన
జగిత్యాల జిల్లాలో త్వరలోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో వెలమ సంక్షేమ మండలి నూతన సంవత్సరం 2022 క్యాలెండర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ మండలి అధ్యక్షుడు యాచమనేని వెంకటేశ్వర్ రావు, ప్రధాన కర్యాదర్శి బోయినపెల్లి ఆనంద్ రావు, సలహా కమిటీ సభ్యులు రాఏశ్వర్ రావు, పురుషోత్తమ రావు, జితేందర్ రావు, ఉపాధ్యక్షులు గంగారావు, జలజ, కోశాధికారి దివాకర్ రావు, సంఘటిత కార్యదర్శులు రాజేందర్ రావు, రవికుమార్, కార్యవర్గ సభ్యులు సురేందర్ రావు, మల్హల్ రావు, అజయ్ రావు, కిరణ్ రావు, కోటేశ్వర్ రావు, శ్రీనివాస్ రావు, శిరీష, మంజుల, మంగ, సుధాకర్ రావు, ఆనంద్ రావు, శరత్ రావు, దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.