చిగురుమామిడి, డిసెంబర్ 22: ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, వాటి ద్వారా గ్రామాల్లో నేరాలను నియంత్రించవచ్చని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సీసీ కెమెరాల కోసం రూ.1.50 లక్షల చెకును గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి బుధవారం ఎస్సై దాస సుధాకర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామాల్లో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇతర నేరాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని చెప్పారు. ప్రతి నేరాన్ని ఛేదించడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమన్నారు. వీటి ద్వారా నిందితులను ఒకరోజులోనే పట్టుకోవచ్చని తెలిపారు. బొమ్మనపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం 22 సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ కానుగంటి భూమిరెడ్డి, ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం, ఉప సర్పంచ్ పెండ్యాల శారద, పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత, వార్డు సభ్యులు తిరుపతి విజ్జగిరి, పెండ్యాల ప్రభ, గోల్లోని సరవ్వ, పోలీసు సిబ్బంది రాజు, రాజశేఖర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తా..
చిగురుమామిడి, డిసెంబర్ 22: ఆరుతడి పంటల కోసం రైతులకు చెరువుల ద్వారా నీరు అందించే విషయాన్ని ఎమ్మెల్యే సతీశ్కుమార్ దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులతో నీటి విడుదలకు కృషి చేస్తానని ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో రేకొండ ఊర చెరువు ఆయకట్టుకు చెందిన రైతులు చెరువు తూము ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఎంపీపీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గోదావరి జలాల ద్వారా నియోజకవర్గంతో పాటు మండలంలోని అనేక చెరువులను నింపిందన్నారు. అన్ని గ్రామాలకు పంటల సాగుకు నీరందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్యను వెంటనే పరిషరిస్తామని హామీనిచ్చారు. ఇక్కడ రైతులు బరిగెల తిరుపతి, మోర బుచ్చయ్య, రాజేందర్, రాజిరెడ్డి, శ్రీకాంత్, శ్రీధర్, రాజు ఉన్నారు.