తెలంగాణ బాలల హకుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జే శ్రీనివాస్రావు
కరీంనగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బాలల హకుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బాలల హకుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జే శ్రీనివాసరావు ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ కరీంనగర్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో బాలలకు, విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో బాలల కోసం చేపడుతున్న కార్యక్రమాలపై శాఖల వారీగా సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, కొవిడ్-19 నేపథ్యంలో విద్యార్థులు ఆన్లైన్ తరగతులతో సెల్ఫోన్లు, లాప్టాప్లతో సోషల్ మీడియాకు బానిసైనట్లు పేర్కొన్నారు. బాలలపై హింసాత్మక ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసు 83 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. బాలల రక్షణ, సంరక్షణ, నేరారోపణలు ఎదురొంటున్న పిల్లల రక్షణ గురించి చైల్డ్ లైన్ 1098 అందిస్తున్న సేవలను వివరించారు. అంతకుముందు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చొప్పదండి, రుక్మాపూర్, కొలిమికుంటలోని అంగన్వాడీ కేంద్రాలు, రుక్మాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల, కరీంనగర్లోని బాల సదన్, శిశు గృహాలను సందర్శించారు. కార్యక్రమంలో తెలంగాణ బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు అనుమాండ్ల శోభారాణి, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, సభ్యులు రేండ్ల కలింగ శేఖర్, రాధ, విజయ్, చైల్డ్ లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ సంపత్, డీఎంహెచ్వో డాక్టర్ జువేరియా, డీఈవో జనార్దన్రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ నతానియేల్, ఏసీపీ మదన్లాల్, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.