పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
జూలపల్లిలో 22 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
90 మంది క్రైస్తవులకు పండుగ దుస్తుల పంపిణీ
జూలపల్లి, డిసెంబర్ 22: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. జూలపల్లి మండల కేంద్రంలో బుధవారం ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి అధ్యక్షతన 22 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. 90 మంది క్రైస్తవులకు క్రిస్ట్మస్ పండుగ దుస్తులు పంపిణీ చేశారు. ఈసందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వాలు కులమతాలకతీతంగా అందరిని ఆదుకోలేదని పేర్కొన్నారు. ఇక్కడ జడ్పీటీసీ సభ్యుడు బొ ద్దుల లక్ష్మన్, ఏఎంసీ చైర్మన్ కంది చొక్కారెడ్డి, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, సర్పంచులు దారబొయిన నరసింహం,మేచినేని సంతోశ్రావు, బంటు ఎల్లయ్య, మాంకాలి తిరుపతి, ఈర్ల మల్లేశం, ఎంపీటీసీ తమ్మడవేని మల్లేశం, దండె వెంకటేశం, అమరగాని మమత, ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్రావు, ఆర్భీఎస్ మండలాధ్యక్షుడు విశారపు వెంకటేశం, పార్టీ మండలాధ్యక్షుడు శాతళ్ల కాంతయ్య, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంట రాజేశ్వర్రెడ్డి, తాసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో వేణుగోపాల్రావు, ఎంపీవో రమేశ్, డీటీ శ్రీకాంత్, నాయకులు లాల్మహ్మద్, కూసుకుంట్ల రాంగోపాల్రెడ్డి, నల్లాల కన్కరాజ్, పాటకుల అనిల్, సొల్లు శ్యామ్, కొత్త రవీందర్, రేశవేని శ్రీనివాస్, పల్లె ప్రసాద్, మారుపాక కుమార్ పాల్గొన్నారు.