ఇల్లందకుంట, జనవరి 22: బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించి చదివించాలని డీఈవో జనార్దన్ సీఆర్పీలకు సూచించారు. పాతర్లపల్లిలో బడి బయట పిల్లల సర్వేను శనివారం డీఈవో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల స్థాయిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడికి వెళ్లని, దివ్యాంగుల పిల్లల వివరాలు నమోదు చేసుకోవాలని సీఆర్పీలకు సూచించారు. తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యాన్ని వివరించాలని చెప్పారు. ఇక్కడ ఎంఈవో శ్రీనివాస్, సీఆర్పీలు అజ్జు, శ్రీనివాస్, శ్రుతకీర్తి ఉన్నారు.
సర్వేను పరిశీలించిన డీఈవో
హుజూరాబాద్టౌన్, జనవరి 22: హుజూరాబాద్ మండలంలో సీఆర్పీలు నిర్వహిస్తున్న బడి బయట పిల్లల సర్వేపై మండల విద్యా వనరుల కేంద్రంలో శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్రావు చర్చించారు. ఈ నెల 12 నుంచి 25 వరకు ఈ సర్వే జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. హుజూరాబాద్ మండలంలో నిన్నటి వరకు 14 మంది బడిబయటి విద్యార్థులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. సర్వే చేసి నివేదికలను కంప్యూటర్లో క్రోడీకరించి ఎంఈవోల ద్వారా అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయుడు ఊరుకొండ సత్యప్రసాద్, సీఆర్పీలు గుండ రాజిరెడ్డి, మాదం రవిబాబు, సముద్రాల రమేశ్, తాళ్లపెళ్లి అమరేందర్గౌడ్, రంగు దామోదరాచారి, శనిగరం సుదామన్, గడ్డం శ్రీనివాస్, జంగా తిరుమల, మధు పాల్గొన్నారు.
పిల్లలను చేర్పించిన అధికారులు
శంకరపట్నం, జనవరి 22: బడి బయట పిల్లల సర్వే (ఓఎస్సీ)లో భాగంగా పాపయ్యపల్లెలో అధికారులు బడి బయట విద్యార్థులను గుర్తించారు. ఈ సందర్భంగా 6-14 ఏండ్ల 10 మంది పిల్లలను గుర్తించినట్లు ఎంఈవో నర్సింహారెడ్డి వెల్లడించారు. డీఈవో ఆదేశాల మేరకు గ్రామంలో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడిని నియమించినట్లు వెల్లడించారు. రిసోర్స్ పర్సన్ కొమురయ్య ఉన్నారు.