చిగురుమామిడి, డిసెంబర్ 21: ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని రైతులు మంగళవారం విజ్ఞాన యాత్రకు తరలివెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో నర్సరీలు, ఆయిల్ పాం తోటల పెంపకంపై 40 మంది రైతులకు అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. పంటల సాగు విధానం, మెళకువలు, దిగుబడి లాభాలను రైతులకు వివ
రించారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటలకు ప్రోత్సాహమందిస్తున్నదని ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి మంజువాణి తెలిపారు. మండలంలోని బొమ్మనపల్లి, సుందరగిరి, ఇందురి,్త ముదిమాణిక్యం గ్రామాలకు చెందిన రైతులు ఈ యాత్రకు తరలి వెళ్లారు. తరలిన వారిలో గంప సంపత్, చీల లక్ష్మీరెడ్డి, కంది శంకర్, వంతడుపుల దిలీప్ కుమార్, చాట్ల నాగయ్య ఉన్నారు.
ఆయిల్పామ్ తోటల సందర్శన
ఉద్యానవన శాఖ (కరీంనగర్) అధికారిణి స్వాతి ఆధ్వర్యంలో మంగళవారం మానకొండూర్ మండలంలోని రైతులు ఆయిల్పాం తోటలను సందర్శించారు. కొత్తగూడెం జిల్లాలోని లంకపేట, నరవారిగూడెం, దమ్మాయిపేట గ్రామాల్లో ఆయిల్పాం తోటల సాగు విధానాన్ని, ఫ్యాక్టరీని పరిశీలించారు. అక్కడి అధికారులు, రైతులతో మాట్లాడి వాటి ఆయిల్ పాం సాగు చేస్తే వచ్చే ప్రతిఫలాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకున్నారు. వరికి బదులు వేసే ఇతర పంటల కోసం వీటిని సందర్శించినట్లు అధికారులు, రైతులు వివరించారు. ఇక్కడ కొండపల్కల రైతు బంధు సమితి కన్వీనర్ కడారి ప్రభాకర్, రైతులు దొడ్ల రాయమల్లు, రూపురెడ్డి శ్రీనివాస్రెడ్డి, దాసరి రాజ్ కుమార్, ఎండీ పాషా, రవీందర్రెడ్డి, గోపు శంకర్రెడ్డి, కసిరెడ్డి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.