ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఆర్బీఎస్ చొప్పదండి మండల కో-ఆర్డినేటర్కు నియామక పత్రం అందజేత
చొప్పదండి, డిసెంబర్ 21: ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్గా వెదురుగట్ట గ్రామానికి చెందిన గుడిపాటి వెంకటరమణారెడ్డిని నియమించినట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రకటించారు. గంగాధర మండలం బూర్గుపల్లిలోని తన నివాసంలో మంగళవారం ఆయన వెంకటరెడ్డికి నియామక పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రైతులకు అందేలా చూడాలని సూచించారు. మండల రైతుల సమస్యలను తెలుసుకొని, పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, మండల ప్రజాప్రతినిధులకు ఈసందర్భంగా వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు మచ్చ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బందారపు అజయ్కుమార్, గొల్లపల్లి శ్రావన్ కుమార్, జహీర్, రవి తదితరులు పాల్గొన్నారు.