చొప్పదండి, రామడుగు, కరీంనగర్రూరల్ మండలాల్లో ఆరుతడి పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు
చొప్పదండి, డిసెంబర్ 21: రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని కరీంనగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. మండలంలోని కాట్నపల్లి, చొప్పదండి, దేశాయిపేట గ్రామాల్లో రైతులు సాగు చేసిన వేరుశనగ, పొద్దుతిరుగుడు, శనగ, పెసర తదితర ఆరుతడి పంటలను మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు పంటల సాగులో పాటించే పద్ధతులు, చీడపీడల నివారణకు పురుగు మందులు ఎంత మోతాదులో వాడాలో రైతులకు వివరించారు. యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏవో వంశీకృష్ణ, శాస్త్రవేత్తలు రజినీకాంత్, ఉషారాణి, మదన్మోహన్, ఏఈవోలు మౌనిక, ప్రసన్నకుమార్, రాజశేఖర్ పాల్గొన్నారు.
రామడుగు, డిసెంబర్ 21: మండలంలోని తిర్మలాపూర్లో పలువురు రైతులు సాగు చేసిన ఆరుతడి పంటలను కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందులో భాగంగా యువరైతు కట్ల శ్రీనివాస్ నాలుగెకరాల్లో సాగు చేసిన బెండ, బంతి తోట, ఇతర రైతులు సాగు చేసిన వేరుశనగ, ఇతర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులకు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. ఉషారాణి, రజినీకాంత్, మధన్మోహన్, మండల వ్యవసాయాధికారి యాస్మిన్, సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, ఎంపీటీసీ మోడి రవీందర్, ఏఈవో సంపత్, రైతు కట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, డిసెంబర్ 21: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన ఆరుతడి పంటలను కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశీలించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రజినీకాంత్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ మధన్మోహన్రెడ్డి, ఏఈవోలు గోపీచంద్, అనంతరాజ్, రైతులు పాల్గొన్నారు.