రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి
116 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
గోదావరిఖని, డిసెంబర్ 21: తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పేద వారికి ఆడబిడ్డ భారం కావద్దని ఆడపిల్ల పుడితే రూ.13వేలు, కేసీఆర్ కిట్, వివాహానికి రూ.లక్షా నూట పదహారు రూపాయలు అందజేస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని చెప్పారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం 116 మంది లబ్ధిదారులకు కోటి 15 లక్షల 39,340 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతోపాటు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని అందజేసి ఆయన మాట్లాడారు. పేద ఆడపిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొండంత భరోసాగా నిలుస్తున్నాయన్నారు. కరోనా కాలంలోనూ నిర్విఘ్నంగా అమలు చేసిన ఘనత ఈ సర్కారుకే దక్కిందన్నారు. అందరి ముఖాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నరన్నారు. రామగుండం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం మెడికల్ కళాశాలను ప్రసాదించారన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డా.అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు ఇంజపురి పులెంధర్, ధాతు శ్రీనివాస్, పెంట రాజేశ్, రమ ణ, శంకర్ నాయక్, బాల రాజ్కుమార్, అంజలీ దే వి, దయాకర్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, రాకం వేణు, కాల్వ శ్రీనివాస్, సంజీవ్, రవీందర్ రెడ్డి, జలపతి, గణేశ్, జాహిద్ పాషా, సత్యం, చిలుముల విజయ్, తోకల రమేశ్, నూతి తిరుపతి ఉన్నారు.