రామడుగు, డిసెంబర్ 20: ఎన్నారై తోట సత్యం సేవా దృక్పథం చాలా గొప్పదని తహసీల్దార్ కోమల్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన తోట సత్యం అమెరికాలో స్థిరపడగా, మండలంలోని అన్ని గ్రామాలకు ఉపయోగపడేలా మూడు బాడీ ఫ్రీజర్లను సొంత ఖర్చులతో అం దించారు. ఈ సందర్భంగా సోమ వారం ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ మాట్లాడారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడినా కన్నవారి జ్ఞాపకార్థం నిరుపేదలకు అండగా నిలుస్తుండడం గొప్ప విషయమన్నారు. వాట్సాప్ వాల్ ద్వారా ఎన్నారై తోట సత్యం మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎందరికో సహాయం అందించానని, మున్ముందు మండలంలోని నిరుపేదలందరికీ తోడ్పాటునందిస్తానన్నారు. ప్రస్తుతం పంపిణీ చేసిన మూడు బాడీ ఫ్రీజర్లు తిర్మలాపూర్, షానగర్, గోలిరామయ్యపల్లి గ్రామాలకు అందిస్తూ, ఒక్కో దానిని ఆరు గ్రామాలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో రామడుగు మండలానికి వైకుంఠరథం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అల్గి చైర్మన్ ఉప్పుల అంజనీప్రసాద్, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, తోట సత్యం కుటుంబ సభ్యులు రాములు, శంకర్, కృష్ణ, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.