తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్19: ధాన్యం కొనుగోలు చేయం అని కరాఖండిగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా మండలంలోని ప్రతీ గ్రామంలో నిరసనలు తెలుపడానికి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ పార్టీ కార్యకర్తలకు దిశాదిర్దేశం చేశారు. గ్రా మంలో రైతులను సమావేశ పర్చి, కేంద్ర ప్రభుత్వ విధానాలను రైతులకు వివరించాలని సూచించారు. ఇప్పటికే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శనివారం ఎల్ఎండీలోని క్యాంపు కార్యాలయంలో పలు అంశాలను వివరించారు.
మహాధర్నాకు భారీగా తరలిరావాలి
చిగురుమామిడి, డిసెంబర్ 19: రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు రైతు బీమాను అందిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో రైతులు అద్భుతంగా పంటలు పండిస్తున్నారని అన్నారు. కేంద్రం రైతులు పండించిన పంటలను యాసంగిలో ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పిలుపుమేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి కేంద్రం తీరుపై ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మండల ప్రచార కార్యదర్శి అందే పోచయ్య, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్, సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, నాయకులు ముకెర సదానందం, పెనుకుల తిరుపతి, సర్వర్ పాష, బెజ్జంకి అంజయ్య, బెజ్జంకి రాంబాబు, పెసరి శ్రీనివాస్, పోగాకుల శ్రీకాంత్, పోటుమల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా మండలంలోని అన్ని గ్రామాల్లో మండల శాఖ ముఖ్య నాయకులు సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.