ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మధురానగర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి స్థల పరిశీలన
గంగాధర, జనవరి 18: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని మధురానగర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి మంగళవారం ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, మండలానికి 233 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలువడంతో పాటు నిర్మాణం పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడానికి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ఆధ్యాత్మికతన అలవర్చుకోవాలి
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మండలంలోని కోట్లనర్సింహులపల్లి వీరభద్రస్వామి ఆలయ 31వ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమాల్లో ఆర్అండ్బీ ఈఈ సాంబశివరావు, డీఈ రవీందర్, తహసీల్దార్ శ్రీనివాస్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, మేచినేని నవీన్రావు, తోట కవిత, కంకణాల విజేందర్రెడ్డి, రాసూరి మల్లేశం, ముక్కెర మల్లేశం, జోగు లక్ష్మీరాజం, నాయకులు తోట మల్లారెడ్డి, వేముల అంజి, తోట మహిపాల్, కరబూజ తిరుపతిగౌడ్, ఆకుల మధుసూదన్, రామిడి సురేందర్, తడిగొప్పుల రమేశ్, చిలుముల రమేశ్, వడ్లూరి ఆదిమల్లు, పంజాల ఆంజనేయులు, గంగాధర సంపత్, పెంచాల చందు, ఇరుగురాల రవి తదితరులు పాల్గొన్నారు.