రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మానకొండూర్ రూరల్, జనవరి 18: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మానకొండూర్ మండలం ఖాదరగూడెం, ఈదులగట్టెపల్లి, అన్నారం, దేవంపల్లి, కొండపల్కల, మద్దికుంట, పచ్చునూర్, లక్ష్మీపూర్, వెల్ది, లింగాపూర్, జగ్గయ్యపల్లి, శ్రీనివాస్నగర్, మానకొండూర్ గ్రామాల్లో మంగళవారం ఆయన లబ్ధిదారులకు రూ. 40 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, రూ. 10 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే, ఈదులగట్టెపల్లి గ్రామానికి చెందిన ఇప్పనపల్లి శ్రీనివాస్, దేవంపల్లికి చెందిన పప్పు జంపన్న అనే టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల మృతిచెందారు. పార్టీ తరఫున బీమా సొమ్ము రెండు లక్షల చొప్పున బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఇందుకు కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుకు ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీటీసీ శేఖర్ గౌడ్, వైస్ ఎంపీపీ గోపు మధుసూదన్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్ల వంశీధర్ రెడ్డి, ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, తహసీల్దార్ రాజయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్లు, మహిళా అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.