చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధరలో 41మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
గంగాధర, జనవరి 17: పెళ్లీడుకు ఎదిగిన పేద, మధ్య తరగతి కుటుంబాల ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం భరోసాను ఇస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు రూ.14 లక్షల 4వేల 756 విలువైన చెక్కులను సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. కల్యాణలక్ష్మి పథకంతో రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్, ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, కురిక్యాల విండో చైర్మన్ వెలిచాల తిరుమల్రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, ఎండీ నజీర్, వేముల దామోదర్, కంకణాల విజేందర్రెడ్డి, జోగు లక్ష్మీరాజం, ముక్కెర మల్లేశం, దోర్నాల హన్మంతరెడ్డి, మాల చంద్రయ్య, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, కోలపురం లక్ష్మణ్, నాయకులు దూలం శంకర్గౌడ్, వేముల అంజి, అలువాల తిరుపతి, రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, చిలుముల రమేశ్, జారతి సత్తయ్య, నిమ్మనవేణి ప్రభాకర్, సుంకె అనిల్, పెంచల చందు, మామిడిపెలి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.