మల్యాల/బోయినపల్లి అక్టోబర్16: కొండగ ట్టు ఆంజనేయస్వామిని దసరా సందర్భంగా శుక్రవారం రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ దర్శించుకున్నారు. మిత్రులతో కలిసి ఉద యం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించా రు. స్వామివారి శేషవస్త్రంతో సన్మానించి తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో జమ్మి మొక్క నాటారు. తన సొంత డబ్బులతో విశ్వక్సేన ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పారు. ఆలయ స్థపతిచే స్థలాన్ని గుర్తించి ఎమ్మె ల్యే రవిశంకర్ ద్వారా తనకు సమాచారం అందించాలని సూచించారు. అక్కడి నుంచి ఆలయ అతిథి గృహానికి చేరుకొని స్థానిక ప్రజాప్రతినిధులతో అంజన్న ఆలయ అభివృద్ధి, మెట్లదారి, ఘాట్రోడ్డు నిర్మాణంపై చర్చించారు. ఇక్కడ జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహ న్రావు, ఆలయ అధికారులు బుద్ది శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ రాజేశ్వర్రావు ఉన్నారు.
స్నేహితులతో సరదగా..
ఎంపీ సంతోష్కుమార్ రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తన సొంతూరైన కొదురుపాకలో దసరా వేడుకలు జరుపుకున్నారు. పదో తరగతి బ్యాచ్ స్నేహితులతో కలిసి కారులో విహరించారు. అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. వారిని తన కారులో ఎక్కించుకొని స్వయంగా నడుపుకుంటూ కొండగట్టు ఆలయానికి వెళ్లారు. ఇక్కడ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, ఏఎంసీ డైరెక్టర్లు నల్లగొండ అనిల్, జంగిటి సంజీవ్కుమార్, నాయకులు కవంపల్లి రాములు తదితరులు ఉన్నారు.